279జిఒని ఉపసంహరించుకోవాలి..

తమ కడుపులను కొట్టే జిఒ 279ని ఉపసంహరించుకో వాలని డిమాండు చేస్తూ పారిశుధ్య కార్మికులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించారు. అందులోభాగ ంగా గుంటూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, నగర నాయకులు ముత్యాలరా వును పోలీసులు అరెస్ట్‌ చేసి అనంతరం విడుదల చేశారు. తొలుత నిర్వహించిన ధర్నాలో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, జిఒను రద్దు చేయకుంటే దీర్ఘకాలిక సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు.