144 సెక్షన్‌ ఎత్తేయాలి: పాశం

రాజధానిలో విధించిన 144 సెక్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని, వ్యవసాయ కార్మికులు, ఇతర భూమిలేని వర్గాల ప్రజలకు ఉపాధి కల్పించాలని, ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఐక్య కార్యాచరణ చేపట్టాలని గుంటూరులో మంగళవారం జరిగిన సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. 'రాజధాని ప్రాంతంలో నిర్భంధం' అనే అంశంపై సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షతన జరిగిన సభలో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు ప్రసంగించారు.ప్రభుత్వం రాజధాని ప్రజలకిచ్చిన ఒక్క వాగ్థానం కూడా అమలు చేయకపోగా నిర్భంధాలు ప్రయోగిస్తోంది. ఈ విధానాలను అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఐక్యంగా ఎదుర్కొవాలి. నిర్భంధాలకు ప్రయోగిస్తే ప్రజలు ఏ గుణపాఠం చెబుతారో రాష్ట్ర ప్రభుత్వానికి అనుభవం వుందని పాశం రామారావు అన్నారు