హోదాపై జీపుజాతా:రాంభూపాల్‌

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జీపుజాతాను ప్రారంభించారు. తొలిరోజు రాప్తాడు, శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో జాపుజాతా పర్యటించింది. సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఎనిమిదేళ్లుగా తీవ్ర కరువు నెలకొందని, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రైతులు, చేనేతల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు 2000 కోట్ల రూపాయలు అవసరం కాగా కేవలం రూ.210 కోట్లు కేటాయించి ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరనలో ఎలా సాధ్యమని ప్రశ్నించారు. జిల్లా రైతులకు తక్షణమే ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.