సోషలిజంతోనే సమస్యలు పరిష్కారం:పాటూరు రామయ్య

  ప్రజాసమస్యల పరిష్కారానికి సోషలిజమే మార్గమని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పాటూరు రామయ్య పేర్కొన్నారు. ఇందుకోసం ముందు నుంచి కృషి చేస్తున్న కమ్యూనిస్టు నాయకులను స్మరించు కోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతపురం జిల్లాలో గుత్తిరామకృష్ణ అటువంటి మార్గదర్శ కుడే నని తెలిపారు. స్వాతంత్య్ర సమర యోధులు, అనం తపురం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థా పకుల్లో ఒకరైన గుత్తి రామకృష్ణ శతజయంతి వేడుక లను సిపిఎం అనంతపురం జిల్లా కమిటీ నిర్వహిం చింది. ఆదివారం అనంతపురం నగరంలోని ప్రెస్‌క ్లబ్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.ఇంతి యాజ్‌ అధ్యక్షతన జరిగిన శతజయంతి సందర్భంగా 'అనంత ఆణిముత్యం' పేరుతో గుత్తి రామకృష్ణ రచన లను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ ఆవిష్కరించారు.
అనంతరం పాటూరు రామయ్య మాట్లాడారు. గుత్తిరామకృష్ణ స్వాతంత్య్ర సమరయోధులు, జర్నలిస్టు అని.. అంతకుమించి ఆయన అనంతపురం జిల్లాలో కమ్యూనిస్టుపార్టీ వ్యవసాపకు ల్లో ఒకరయిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియా డారు. రాయలసీమ ప్రాంత తొలి కథా రచయితగానూ ప్రసిద్ధికెక్కారని చెప్పారు. జర్నలి స్టుగా ఉంటూ పీడిత, బడుగు బలహీన వర్గాల పక్షాన నిజాలను వెలుగులోకి తెచ్చే విధంగా తన కలాన్ని నాట్యం చేయించారని అభివర్ణించారు. ప్రాంతీయ వెనుకబాటుతనాన్ని సాహిత్య రూపంలో చక్కగా ప్రపంచానికి తెలియజేశారన్నారు. ఎంతో నిబద్ధతతో నిరాడంబరతతో తుది శ్వాస వరకు స్ఫూర్తిదాయకంగా మెలిగారన్నారు. ఇలాంటి నాయ కులు నేటి తరం వారికి ఆదర్శప్రాయులన్నారు. అప్పట్లో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండేదని అందుకే రామక్రిష్ణ లాంటి వారు ధైర్యంగా అన్యాయాన్ని వెలుగులోకి తేగలిగారన్నారు. నేడు పరిస్థితులు మారాయన్నారు. సామ్రాజ్య వాదులు, పెట్టుబడి దారుల చేతుల్లో ప్రభుత్వ పాలన నడుస్తోందన్నారు. నూతన సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తెచ్చే క్రమంలో జర్నలిస్టులపై దాడులు పెరుగుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ తర్వాత ఇప్పటి వరకు 76 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, సిపిఐఎంఎల్‌ రాష్ట్ర నాయ కులు పెద్దన్న, ప్రముఖ రచయిత శాంతినారాయణ పాల్గొన్నారు.