భారత దేశం ఓ మహోన్నత నేతను కోల్పోయింది. రాజకీయాల్లో విశిష్ట ఖ్యాతిని ఆర్జించిన సిపిఐ సీనియర్ నేత ఏబీ బర్దన్ మనకిక లేరు. కమ్యూనిస్ట్ నేతగా ఉంటూనే ఎంతోమంది ఇతర పార్టీల నాయకులకు ఆయన మార్గదర్శకుడిగా మెలిగారు. బర్దన్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. న్యూఢిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు. సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఆయన చాలాకాలం పనిచేశారు. బర్దన్ మృతిపట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రగాఢసానుభూతి వ్యక్తం చేసింది.