సఫ్దర్‌ ఆశయాలను కొనసాగిద్దాం..

వీధి నాటిక వైతాళికుడు సఫ్దర్‌ హష్మీ 26వ వర్థంతి సందర్భంగా ఆయనకు ఢిల్లీ మేథావి వర్గం, కవులు, కళాకారులు నివాళులర్పించారు. ఢిల్లీలోని కాన్సిటిట్యూషన్‌ క్లబ్‌లో 'సఫ్దర్‌ హష్మీ మెమోరియల్‌ ట్రస్ట్‌' ఆధ్వర్యంలో శుక్రవారం పలురకాల కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలో నానాటికి పెరుగుతున్న అసహనం, మతోన్మాదంపై ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన అందరినీ అకట్టుకుంది. మోడీ నిరంకుశ వైఖరిని, మతోన్మాద ఎజెండాను ఈ ప్రదర్శనలో ఎండగట్టారు. దేశంలోని రచయితలు, మేధావులకు మతంరంగు పులిమి హత్యలు చేస్తున్న వైనాన్ని ప్రముఖంగా ప్రదర్శించారు.