భారత ఆర్థిక వ్యవస్థలో తలుపులు మరింత బార్లా తెరవాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడం కోసం, మౌలిక లోటును పూడ్చడం కోసం సంస్కరణలను మరో అడుగు ముందుకు వేయించనున్నట్లు ఆయన తెలిపారు. భారత్-బ్రిటన్ టెక్ సదస్సులో ఆయన మాట్లాడుతూ ‘ఆర్థిక వృద్ధి విస్తృతమయ్యే కొద్దీ రక్షణాత్మక విధానాలను అవలంబించే వాళ్లు కూడా తగ్గిపోతారన్నారు..