వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌..

బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌ కొనసాగుతోంది.  బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటిని ఇవ్వకుండా అన్యాయం చేసిన కేంద్రం, ప్రశ్నించకుండా ప్రజలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు పిలుపునిచ్చారు.విభజన చట్టంలో ఇస్తామని హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులేవీ బడ్జెట్‌లో దక్కలేదన్నారు. చంద్రబాబు కేంద్రంతో కలిసి నాటకాలాడుతున్నారని, కేంద్రం దగ్గర ఒక మాట, ఇక్కడ మరో మాట చెబుతున్నారని విమర్శించారు.