వరద బాధితులను ఆదుకోవాలి:మధు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైన ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పూర్తిగా జన జీవనం స్తంభించిందని, రోడ్లు, రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయని తెలిపారు. నిత్యావసర వస్తువులూ నీట మునిగాయని పేర్కొన్నారు. వెంటనే పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి బాధితులను ఆదుకోవాలని, ముంపు ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.