వచ్చే ఏడాది మోడీ పాక్ పర్యటన..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చే ఏడాది పాక్ లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో తన పాక్ పర్యటనపై సుష్మా ప్రకటన చేశారు. 2016లో పాక్ లో జరిగే అంతర్జాతీయ సదస్సుకు మోడీ హజరౌతారని తెలిపారు.