రూ.1810 కోట్ల FDIలకు ఆమోదం..

మోడీ ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతులను వేగవంతం చేస్తోంది. తాజాగా రూ.1,810.25 కోట్ల విలువ చేసే ఆరు ఎఫ్‌డిఐ ప్రతిపాదనలకు కేంద్ర ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు ఆమోదం తెలిపింది. అక్టోబర్‌ 30న జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.