రిషికేశ్వరి మృతిపై విచారణ

అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషికేశ్వరి మృతిపై బాలసుబ్రహ్మణ్యం కమిటీ బుధవారం ఉదయం విచారణ ప్రారంభించింది. నెల్లూరు విక్రమసింహ వర్సిటీ వైస్ ఛాన్సలర్ వీరయ్య, వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ బాలకృష్ణమనాయుడు, పద్మావతి వర్సిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.