రాజధాని అభివృద్ధి పనులు చేపట్టడానికి తాడేపల్లి పురపాలక సంఘ పరిధిలోని రిజర్వు ఫారెస్టు ఏరియాని సీఆర్డీఏకు ఇచ్చేందుకు కౌన్సిల్ ఆమోదించింది. తాడేపల్లి పట్టణ పరిధిలో ఉన్న రిజర్వు ఫారెస్టు ఏరియాలో 1032 నివాసాలు ఉన్నాయని, వాటన్నింటినీ క్రమబద్ధీకరణ చేయాలనీ కౌన్సిల్ తీర్మానించింది. అలాగే, ముఖ్యమంత్రి అతిథి గృహానికి వెళ్లే దారిలో వర్క్షాపు వైజంక్షన్ వద్ద రూ.14లక్షల 50 వేల వ్యయంతో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయడానికి రూపొందించిన అంచనాలను ఆమోదించారు.