రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ని ఆ పదవి నుంచి తొలగించాలని భాజపా సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఈ మేరకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.రాజన్ భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా మారారని విమర్శించారు.