రాజధాని నిర్మాణంతో వ్యాపారాలు చేస్తున్న సీఎం:పి.మధు...

 

అనంతపురం: హంద్రీ-నీవా నిర్మాణ పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని ఉరవకొండలో రైతు సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపీ రాజధాని నిర్మాణంతో వ్యాపారాలూ చేస్తూ... చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలైన ఎస్పీవై రెడ్డి, పుల్లారెడ్డిలకు రూ.2.150 కోట్ల విద్యుత్ రాయితీలు కల్పించిన ప్రభుత్వం మున్సిపల్, మధ్యాహ్న భోజనం, అంగన్ వాడీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడేందుకు ఇష్టపడటం లేదని విమర్శించారు. పార్లమెంట్ లో ప్రత్యేక హోదా ఇస్తానన్న మోదీ ఆ వాగ్ధానాన్ని నిలబెట్టుకోలేకపోయారని తెలిపారు