మోడీ అన్నింటా వైఫల్యం:కారత్

ప్రధాని నరేంద్రమోడీ అన్నింటా వైఫల్యం చెందారని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు  ప్రకాశ్ కరత్ పేర్కొన్నారు. నగరాలు, పట్టణాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణాల్లో సరిపోలని లెక్కలున్నాయన్నారు. మరుగుదొడ్లు నిర్మించినా నీటి సమస్య నిర్వహణ లోపం ఉందన్నారు. జన్ ధన్ యోజన పథకం నిద్రావస్థలో ఉందని ఎద్దేవా చేశారు. రూ. 17 కోట్ల జన్ ధన్ ఖాతాల్లో పైసా లేదని విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా పథకం ఎక్కడి గొంగళి అక్కడేనన్న చందంగా ఉంది అన్నారు. కేంద్రమంత్రులు కుంభోణాల్లో మునిగితేలుతున్నారని విమర్శించారు .