మోడీని కలిసినా ప్రయోజనం లేదు..

మోడీని స్వయంగా కలిసి రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరినా ఫలితం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వెలిబుచ్చారు. విజయవాడలో మంగళవారం జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో కేంద్రంపై తన అసంతృప్తిని ఆయన బహిరంగంగా వెల్లడించారు. ప్రత్యేక హాదా, రాజధాని నిర్మాణానికి నిధులు, రాయలసీమ, ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం, పారిశ్రామికాభివృద్ధికి ఊతం, పోలవరానికి నిధులు, విశాఖకు రైల్వే జోన్‌ వంటి అంశాల్లో కూడా బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం జరగలేదన్నారు.