మాజీ సీఎంలకు ఎదురుదెబ్బ

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ఆరుగురికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రెండు నెలల్లోపు ప్రభుత్వ బంగ్లాలను ఖాళీ చేయాల్సిందిగా జస్టిస్ అనిల్ ఆర్ దవే సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.ఆదేశాలు అందుకున్నవారిలో మాజీ సీఎంలు మాయావతి, ములయాం సింగ్ యాదవ్, ఎన్డీ తివారి, కళ్యాణ్ సింగ్, రాజ్నాథ్ సింగ్, రామ్ నరేష్ యాదవ్ ఉన్నారు