మక్కాలో 700మంది పైగా మృతి

మక్కాలో మహా విషాదం చోటు చేసుకుంది. హజ్‌ యాత్రలో జరిగిన తొక్కిసలాటలో 700 మందికిపైగా మరణించారు. చివరిరి అంకమైన 'జమారత్‌'కోసం మక్కాకు సమీపంలోని'మీనా' (సైతాన్‌ శిల) వద్దకు చేరుకున్న వేలాది మంది యాత్రికులు గురువారం తొక్కిసలాటకు గురి కావటంతో దాదాపు 715 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. క్షతగాత్రుల సంఖ్య 800 మందికి పైగానే వుంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.