మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ?

 బిహార్ శాసనసభ ఎన్నికల్లో బిజెపికి ఘోర పరాజయం ఎదురైనందున త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు ఉన్నాయని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 26నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించి, సరిగా పనిచేయని కొంత మంది మంత్రులకు ఉద్వాసన పలుకుతారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి..