పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో అసైన్డ్ భూముల సేకరణపై నిరసన వెల్లువెత్తింది. సుమారు 500 మంది రైతులు తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. మండలంలోని దూబచర్ల, పుల్లలపాడు, ముసళ్లగుంట గ్రామాల పరిధిలోని దళితులు, బిసిలకు చెందిన మూడు పంటలు పండే 150 ఎకరాల అసైన్డ్ భూమిని సేకరించి రక్షణరంగ విడి భాగాల తయారీ పరిశ్రమలు నిర్మించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.