భారత్‌లోనూ హై అలర్ట్‌..

పారిస్‌ నరమేధం నేపథ్యంలో భారత్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ వాహనాలను సోదాలు నిర్వహిస్తున్నారు. అటు అగ్రరాజ్యం అమెరికా సైతం పారిస్ ఘటనతో అప్రమత్తమైంది. ముఖ్యప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, ప్రధాన సెంటర్లలో పట్టిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పారిస్ నగరంలో పలు చోట్ల కాల్పులు, పేలుళ్లు జరిగిన ఘటనలో 170 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రపంచ దేశాల అధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.