బాక్సైట్ పోరు ఉధృతం:రఘువీరా

 ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా చేపట్టిన బాక్సైట్ తవ్వకాలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన తీవ్రతరం చేయనున్నట్లు రఘువీరారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా జనవరి 28, 29 తేదీల్లో విశాఖ మన్యంలో కాంగ్రెస్ నాయకులు, గిరిజన ఎంపీల బృందం పర్యటించాలని నిర్ణయించినట్లు రఘవీరా తెలిపారు.