ప్రత్యేక హోదాకై బంద్ కు పిలుపు

ప్రత్యేక హోదా..ప్యాకేజీ విషయంలో కేంద్రం మరోసారి మోసం చేసిందని..నమ్మక ద్రోహం చేసిందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తరువాత దృష్టి సారిస్తే రైల్వే జోన్ ప్రకటించాలి..ఉక్కు పరిశ్రమ ప్రకటించాలి కదా అని ప్రశ్నించారు. సెంట్రల్ యూనివర్సిటీ..గిరిజన యూనివర్సిటీ పెద్ద వాటిని పక్కన పెట్టి చిన్న చిన్న వాటివి కల్పిస్తారా ? అని నిలదీశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే అఖిలపక్ష సమావేశం పిలవాలని డిమాండ్ చేశారు. ఎల్లుండి బంద్ కు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.