పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా భారత్ బంద్

భారత్‌బంద్‌లో భాగంగా విజయవాడలో విద్యాసంస్థలకు ముందస్తుగా సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోలేదు. పెట్రోల్‌ బంక్‌లు మూతపడగా, దుకాణాలు మూసే ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు పాక్షికంగా నడిచాయి. బంద్‌ వాతావరణం స్పష్టంగా కనిపించింది.