రాష్ట్రంలోని నగర పాలక సంస్థల్లో పారిశుధ్య కార్మికుల తొలగింపునకు దారితీసే 279 నెంబరు జీవోను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మున్సిపల్ వ్యవహారాల మంత్రి నారాయణకు ఒక లేఖ రాశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలో కొస్తే ఇంటికో ఉద్యోగమని వాగ్దానం చేసి, ఔట్ సోర్సింగ్ విధానంలోనూ కార్మికులను తీసుకోకుండా పారిశుధ్య పనులను కాంట్రాక్ట్కు ఇవ్వటం, యంతాలతోనే పనులు చేయించాలను కోవడం సరికాదని మధు పేర్కొన్నారు.