నేడే వరంగల్‌ పార్లమెంట్‌ పోరు..

వరంగల్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ నేడు  ఉదయం ఏడు గంటలకే ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల సందర్భంగా 791 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఖమ్మం జిల్లా చర్ల ఘటనతో ఆ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత సిద్ధం చేశారు. 1778 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 8వేల 160 మంది సిబ్బందిని నియమించారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్‌ వాకాటి కరుణ తెలిపారు.