
శ్వేతపత్రం, చర్చల పేరుతో బాక్సైట్ తవ్వకాలకు కుట్ర
- ముఖ్యమంత్రికి సిపిఎం లేఖ
ప్రజాశక్తి- విజయవాడ ప్రతినిధి
శ్వేత పత్రం విడుదల, చర్చల పేరిట బాక్సైట్ తవ్వకాలకు కొనసాగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ఈనెల 30వ తేదీలోగా బాక్సైట్ తవ్వకాల అనుమతులను ఉప సంహరించుకోవాలని ఆయన డిమాండు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు బాక్సైట్ తవ్వకాలు అక్రమమని గవర్నర్కు ఫిర్యాదు చేసిన చంద్రబాబు, ఇప్పుడు అవే విధానాలను ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు సిఎం చంద్రబాబుకు మధు బుధవారం ఒక లేఖాస్త్రాన్ని సంధించారు. బాక్సైట్ తవ్వకాలలో చట్టాలను అతిక్రమిస్తు న్నారంటూ గవర్నర్కు చంద్రబాబు 2012 ఏప్రిల్ 4న రాసిన లేఖ ప్రతిని, మధు తన లేఖతో పాటు జోడించారు. విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో మధు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పీసా, అటవీ హక్కుల చట్టం, గిరిజన సలహా మండలి