నగదు కొరత మరో ఐదు మాసాలు..

 ఇప్పట్లో నగదు కొరత తీరే అవకాశాలు కానరావడం లేదు. మరో ఐదు నెలల వరకు ఇదే దుస్థితి కొనసాగనుందని స్వయంగా బ్యాంకింగ్‌ సంఘాలు పేర్కొంటున్నాయి. వచ్చే నాలుగైదు మాసాలు ఇదే నగదు కొరత ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. దేశంలోని నాలుగు ముద్రణాలయాలు పూర్తి స్థాయిలో పనిచేసినా, ఇప్పటికిప్పుడు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదన్నారు. వచ్చే నెలలో ఉద్యోగుల వేతనాలకు సమస్యలు ఏర్పడతాయని చెప్పారు