దాద్రీ ఘటనకు వినూత్న నిరసన

పిఎల్‌ సుందరం తన పార్టీ కార్యకర్తలతో కలసి 'తమిళ మానిల వివసాయిగళ్‌ సంగం' (తమిళనాడు రాష్ట్ర వ్యవసాయ కార్మికుల అసోసియేషన్‌) ఇక్కడికి 65 కిలోమీటర్ల దూరంలోని సత్యమంగళంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఒక ప్యాకెట్‌ను బయటకు తీసి, ఇది గొడ్డుమాంసమని, దీన్ని తాను తింటున్నానంటూ, కొన్ని ముక్కలను ప్రదర్శనకారులకూ పంచిపెట్టారు. ఒక గంట పాటు జరిగిన ఈ నిరసన ప్రదర్శనకు పోలీసులు గట్టి బందోబస్తు చేశారు.