త్యాగాలు చేసేది కమ్యూనిస్టులే:గపూర్‌

కమ్యూనిస్టుల ఆశయం అంటే ప్రజల కోసం పనిచేయడమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎంఎ గపూర్‌ అన్నారు. మంగళగిరిలో సోమవారం నిర్వహించిన కంటే రంగారావు 29వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకొచ్చిన వారు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం త్యాగాలు చేసేది కమ్యూనిస్టులు మాత్రమేనని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత కందిపప్పు, మినప్పప్పు, ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వాలు వ్యాపార వర్గాలపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు.