తెలంగాణా స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం..

ఏపీ రాష్ట్రంలో వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఘాటు పదాలు వాడడం..దీనికి స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై టి.కాంగ్రెస్ ఆగ్రహంగా ఉంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగంలో సీఎం కేసీఆర్ విపక్షాలపై పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవర్ అభ్యంతరం తెలిపింది. సీనియర్ నేతలపై ఇలాంటి విమర్శలు చేయడం తగదని పేర్కొంది. దీనిపై స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.