ఢిల్లీలో వెంకయ్య..బెజవాడలో బాబు

ప్రత్యేక హోదాపై తెలుగు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మూడు నామాలు పెట్టిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ హోదాపై ఢిల్లీలో వెంకయ్య నాయుడు, విజయవాడలో చంద్రబాబు హైడ్రామా చేశారన్నారు. కేంద్రం నుండి టీడీపీ బయటకు రావాలని నారాయణ డిమాండ్ చేశారు