ఉన్నత ఆదాయ వర్గాలకు ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీపై కేంద్రం కోత విధించింది. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు దాటిన వారికి గ్యాస్ సబ్సిడీ ఎత్తివేసింది. దీనికి సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది. రాయితీ ఎత్తివేత జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఆదాయ వివరాలు ప్రకటించని వారికి పన్ను చెల్లింపుల ఆధారంగా సబ్సిడీని ఎత్తివేస్తామని కేంద్రం ప్రకటించింది.