చిరస్మరణీయుడు జాఘవా:గఫూర్‌

 తెలుగు భాషా వికాసానికి గుర్రం జాషువా విశేష కృషి చేశారని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ కొనియాడారు. తన అద్వితీయ కవిత్వం ద్వారా ప్రజలందరి ఐక్యతకు తెలుగు కవితా సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకు న్నారన్నారు. కెవిపిఎస్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో గుర్రం జాషువా 120వ జయంతి విజయవాడలోని సిఐటియు నగ ర కార్యాలయంలో సోమవారం జరిగింది. తొలుత జాషువా చిత్రపటానికి గఫూర్‌ పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం కెవిపిఎస్‌ నగర కార్యదర్శి జి.నటరాజు అధ్యక్ష తన జరిగిన సభలో గఫూర్‌ మాట్లాడుతూ, అభ్యుదయ భావాలతో సాగిన ఆయన రచనలు నేటితరానికి ఆదర్శప్రా యమన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమా మహేశ్వరావు మాట్లాడుతూ, పద్యరచన, కవితా రచనల ద్వారా జాషువా సమకాలీన సమాజంలో అభ్యున్నతిని చాటా రన్నారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పిన్నమనేని మురళీకృష్ణ పాల్గొన్నారు.