చర్చకు రానున్న రిచా వివాదం

అలహాబాద్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షురాలు రిచాసింగ్‌ విశ్వవిద్యాలయ అధికారుల అణచివేత ధోరణులపై ధ్వజమెత్తారు. రిచాసింగ్‌ ఈ వర్సిటీలో అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళ. ఏబీవీపీ ప్రత్యర్థి రజ్‌నీశ్‌ కుమార్‌ సింగ్‌ను ఓడించి రిచాసింగ్‌ అధ్యక్ష పదవిని చేపట్టారు. విశ్వవిద్యాలయంలో జరిగే కార్యకలాపాలన్నింటిలో ఆమె ముందున్నారు. తాను విశ్వవిద్యాలయ అధికారుల తప్పుడు నిర్ణయాలకు, హిందూత్వ శక్తుల ఆగడాలకు అడ్డు నిలవడం వల్లనే తనపై పలు రూపాల్లో దాడి చేస్తున్నారని రిచా అన్నారు. పార్లమెంటులో రిచా వివాదం చర్చకు రానున్న నేపధ్యంలో కేంద్రప్రభుత్వం దిక్కు తోచని పరిస్తితులో పడింది..