చంద్రబాబుది హోల్‌సేల్‌ దోపిడీ..

 రాష్ట్రంలో చంద్రబాబు హోల్‌సేల్‌గాను, దిగువ స్థాయి నాయకులు రిటైల్‌గాను దోపిడీ చేస్తున్నారని పిసిసి చీఫ్‌ ఎన్‌ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులపైనా టిడిపి రౌడీలు దౌర్జన్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని ఆదివారం విజయవాడలో నిర్వహించారు.ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లా డుతూ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలిసుంటే రూ. 2 లక్షల కోట్లు నిధులు ఎపికి వచ్చే ఉండేవన్నారు. ఎపి విభజనతో రాష్ట్రానికి రూ. 5 లక్షల కోట్లు రావాల్సి ఉంటే, సిఎం తన ఆత్మగౌరవం తాకట్టు పెట్టి భిక్షం ఎత్తుకొంటున్నారని ఎద్దేవా చేశారు.