చంద్రబాబుకు హైకోర్టులో వూరట

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టులో వూరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయంపై దర్యాప్తు జరపాలన్న తెలంగాణ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. పూర్తి విచారణ కోసం కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించించిన హైకోర్టు విచారణను 8 వారాలపాటు వాయిదా వేసింది.