ఖమ్మం కార్పొరేషన్‌పైఎర్రజెండా..

నీతివంతమైన పాలనవైపే ఖమ్మం నగర ప్రజలు ఉంటారని వీరి అండతో కార్పొరేషన్‌పై ఎర్రజెండా ఎగరేస్తామని సీపీఐ(ఎం) తమ్మినేని వీరభద్రం అన్నారు.ఖమ్మం మున్సిపాల్టీ ప్రారంభం నుంచి చిర్రావూరి, అఫ్రోజ్‌ సమీనాలు నీతివం తమైన పాలన అందిం చారని, చిర్రా వూరి ఆశయాలకు అను గుణంగా ముందు కు పోతామన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆపరేషన్‌ ఆకర్ష్‌కు ప్రయత్నిస్తోందన్నారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని హితువుపలికారు. ఖమ్మం నగర అభివృద్ధి సీపీఐ(ఎం)తోనే సాధ్యమైందన్నారు. నగరంపై పూర్తి స్థాయి అవగాహన కలిగిన సీపీఐ(ఎం)ని రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆదరించాలని కోరారు.