కోల్‌స్కామ్‌లో మన్మోహన్‌కు ఊరట

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కోల్‌స్కామ్‌ కేసులో సాక్షిగా చేర్చాలంటూ వేసిన పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను కోల్‌స్కామ్‌ కేసులో నిందితుడు, జెఐపిఎల్‌ డైరెక్టర్‌ ఆర్‌ ఎస్‌ రంగ్తా వేశారు. డాక్యుమెంట్లు పిఎమ్‌ఒ కార్యాలయం, నుండి గనుల మంత్రి కార్యాలయం వెళ్లిన డాక్యుమెంట్ల గురించి ప్రశ్నించుటకు మాజీ ప్రధాని మన్మోహన్‌ను సాక్షిగా చేర్చాలంటూ వేసిన పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి భరత్‌ పరాషార్‌ తోసిపుచ్చారు.