కాషాయ నేతల అమానుషదాడి..

రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థులపై బిజెపి నేతలు అమానుష దాడికి దిగారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను పిడిగుద్దులు గుద్దారు. కాళతో తన్నారు మా కార్యాలయం ముందే ధర్నా చేస్తారా అంటూ నోటికి వచ్చిన బూతులన్నీ తిట్టారు.విజయవాడలోని బిజెపి కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది.