జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాను కాంగ్రెస్ నేతలు గాలికొదిలేశారని, లలిత్మోదీ వివాదానికి ఆ పార్టీ పరిమితమైందని ఆయన తన ట్విటర్లో వ్యాఖ్యానించారు. 5 కోట్ల మంది సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు కాంగ్రెస్ నేతలకు పట్టదా అని పవన్ ప్రశ్నించారు.