కశ్మీరీ ప్రజల గొంతును వినండి మోదీ..

జమ్ముకశ్మీర్‌ పరిస్థితుల గురించి అమెరికాలో నివసించే 17ఏళ్ల బాలిక ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కశ్మీర్‌కు చెందిన ఫాతిమా షహీన్‌ అమెరికాలోని జార్జియాలో ఉంటున్నారులేఖలో దయచేసి కశ్మీరీ ప్రజల గొంతును వినండి.. అని మోదీని అర్థించారు. అక్కడి ప్రజల పట్ల సానుభూతి ఉంటే.. అన్ని రకాల ప్రసార మాధ్యమాలను నిలిపివేయకుండా, పరిస్థితి అదుపు చేయడానికి మరో మార్గం ఎంచుకోవాలని కోరారు. వారి స్వేచ్ఛకు భంగం కలిగించొద్దని లేఖలో కోరారు..