రాజద్రోహం ఆరోపణలపై అరెస్టయిన జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్కు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ. 10,000 వ్యక్తిగత పూచీకత్తుపై ఆరు నెలల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ బుధవారం కోర్టు తీర్పునివ్వడంతో జేఎన్యూ విద్యార్థిలోకంలో ఉత్సాహం వెల్లివిరిసింది.