ఓట్లడిగేహక్కు బాబుకు లేదు..

కల్వకుర్తి ప్రాజెక్టుపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ఓట్లడిగే హక్కు కోల్పోయారని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు తనకు రెండు కళ్ళుగా పేర్కొన్న చంద్రబాబు ఇప్పుడు తన నిజ స్వరూపాన్ని చాటుకున్నారని తెలిపారు. వలసలతో గోస పడుతున్న మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజలకు సాగునీరందించే ఉద్ధేశ్యంతో చేపట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు.