అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ అయ్యారు. ఆసియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఇరు దేశాధినేతలు.. లావోస్ రాజధాని వియంటియానెలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, భాగస్వామ్యంపై వీరిద్దరూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.