ఎంపీలు రాజీనామా చేస్తే గంటలో ప్రత్యేక హోదా:రామకృష్ణ

తూ.గో:ఎంపీలు రాజీనామా చేస్తే గంటలో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని సీపీఐ నేత రామకృష్ణ చెప్పారు. ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర తూర్పుగోదావరి జిల్లా తునికి చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో పదిరూపాయలకే బిర్యానీ తింటున్న ఎంపీలు రాష్ర్టాన్ని పట్టించుకోవటం లేద ని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 11న రాష్ట్ర బంద్‌ చేపట్టనున్నట్లు రామకృష్ణ వివరించారు.