ఊళ్లకు ఊళ్లే మారొచ్చు:బాబు

రాజధాని ప్రాంతంలో సమస్యల పేరుతో రైతులు తిరగ బడితే వారికే నష్టమని, కొద్దిమంది పనీపాటా లేనివాళ్లు మాత్రమే అక్కడ అల్లరి చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులకున్న రుణమాఫీ మొత్తం రద్దు చేస్తానని తాను చెప్పలేదని, వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.1.50 లక్షల మాత్రమే ఇస్తానని చెప్పానని అన్నారు.రోడ్లవల్ల కొద్ది ఇళ్లు పోతాయని, ఆందోళన చేపడితే భవిష్యత్‌లో జరిగే మార్పులకు ఊళ్లకు ఊళ్లే మార్చాల్సిన పరిస్థితి రావచ్చని తెలిపారు..