ఉభయసభల్లో బిల్లుల ఆమోదం..

శీతాకాలంలో వాడివేడిగా సాగిన పార్లమెంట్‌ ఉభయసభలు బుధవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఎన్డీయే సర్కారు మెజార్టీలో ఉన్న లోక్‌సభలో మొత్తం 13 బిల్లులకు ఆమోదం లభించగా, రాజ్యసభలో తొమ్మిది బిల్లులు ఆమోదం పొందాయి...బాలల న్యాయ చట్ట సవరణ బిల్లు, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక బిల్లు, బోనస్‌ చెల్లింపుల బిల్లు, ఆర్బిట్రేషన్‌, కాన్సిలేషన్‌(సవరణ)బిల్లు, పరిశ్రమల (అభివృద్ధి, క్రమబద్ధీకరణ) సవరణ బిల్లు, అణుశక్తి సవరణ బిల్లు, వాణిజ్య కోర్టులు, డివిజన్లు, వాణిజ్య అప్పిలేట్‌ డివిజన్‌ హైకోర్టుల బిల్లు, న్యాయమూర్తుల వేతనాల సవరణ బిల్లు తదితర బిల్లులున్నాయి.