ఉపాధిహామీ సంగతేంటి? :VSR

అభివృద్ధిలో అట్టడుగున ఉన్న వ్యవసాయ కార్మికులతో వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు మమేకం కావాలని రైతుసంఘం జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో గురువారం జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు.ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేసి 200 రోజుల పని దినాలు, రోజుకు రూ.300 వేతనం అందించాలని వర్క్‌షాప్‌ తీర్మానించిందని వెంకటేశ్వర్లు తెలిపారు. వలసలు నివారిస్తామని, ఎప్పుడు పని అడిగితే అప్పుడు పని చూపిస్తామని చట్టంలో పేర్కొన్నా సక్రమంగా అమలు చేయడం లేదన్నారు.